శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నేడు మహా యోధ, భరతమాత ముద్దుబిడ్డ శ్రీ. మహారాణా ప్రతాప్ సింహ్ జీ జన్మదినం

>> Tuesday, May 9, 2017

నేడు మహా యోధ, భరతమాత ముద్దుబిడ్డ, ప్రాతఃస్మరణీయుడు, మన పూర్వీకుడు,  మేవార్ రాజపుత్ర మహరాజ్...
శ్రీ. మహారాణా ప్రతాప్ సింహ్  జీ జన్మదినం 💐💐💐



వియత్నాం  అమెరికాని ఓడించి యుద్ధంలో ఎలా గెలిచారో ఒక్కసారి వారి అధ్యక్షుల మాటల్లోనే .
అన్నీ దేశాలలోకెల్ల శక్తిశాలి అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు, శ్రేష్టమైన దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని జీవనంనుండి ప్రేరణపొంది యుద్దనీతి, ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్ధంలో గెలిచాము.
విలేకరులు అడిగారు ... ఎవరా భారతీయ మహారాజు?
వియత్నాం అద్యక్షుడు నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు. '' అతడే రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింగ్ ''
మహారాణా ప్రతాప్ సింగ్ పేరు చెప్పెటప్పుడు ఆయన కళ్ళు ప్రత్యక్షంగా రాణా ను చూస్తున్నంత మెఱుపు  తో నిండిపోయాయి..
“ఒకవేళ మహారణా ప్రతాప్ సింగ్ మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.”
కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు అయితే అతని సమాధి మీద ఇలా రాయించుకున్నారాయన.. “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుడిది” .
కాలాంతరంలో వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహుల శ్రద్ధాంజలి గటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు ఆ తరువాత ఎర్రకోట, ఇంకా, ఇంకా ఇలా చూపించారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”.
ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు....'' ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజు” అని అన్నాడు....!

మహారణా ప్రతాప్ సింహ్ జీ  గురించి మరికొన్ని విశేషాలు:-

పేరు-కుంవర్ ప్రతాప్ జి (శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్)
జన్మదినం-9 మే,1540
జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్
పుణ్యతిది-29 జనవరి,1597
తండ్రి – మహారణా ఉదయ్ సింహ్ జి
తల్లి-రాణి జీవత్ కాంవర్ జి
రాజ్య సీమా-మేవాడ్
శాశన కాలం -1568-1597 (29 సంవత్సరాలు)
వంశం –సూర్యవంశం
రాజవంశం-సిసోడియ రాజపుత్రులు
ధార్మికం-హిందూధర్మం
ప్రసిద్ధ యుద్ధం- హల్ది ఘాట్ యుద్ధం
రాజధాని-ఉదయ్ పూర్

ఇంకా తెలుసుకోవాల్సినవి- శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”. అబ్రాహిం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి వచ్చేది ఉండే అప్పుడు తన తల్లి భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అన్నాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వశాపాత్రుడగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభపెట్టిన తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందాట.కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయ్యింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” చదువొచ్చు.

మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు ఉంటుంది.చేతి కవచం, శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.
డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహారణా ప్రతాప్ ని ఒకసారి తల దించి నా కాళ్ళ మీద పడుతే సగం హిందూస్థాన్కి రాజుని చేస్తా అని ప్రలోభపెట్టాడు కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా తిరస్కరించాడు.
హల్దిఘాట్ యుద్ధంలో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో సమీకరించబడాయి
మహారణా ప్రతాప్ ఇష్టమైన గుర్రంకి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు, ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది.
మహారణా యుద్ధంలో తన అభేద్యమైన దుర్గం లను వదులుకున్నప్పటినుండి కంసాలి వాళ్ళు వేల సంఖ్యలో వల్ల ఇళ్లను వదిలి రాణా కోసం ఆయుధాలు తయారు చేసేవారు.వల్ల దేశ భక్తికి నా తల వంచి ప్రణమిల్లుతున్నాను.
హల్ది ఘాట్ యుద్ధం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నెలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుధం దొరికింది.
మహారణా ప్రతాప్ సింహ్ దగ్గర యుద్ద శిక్షణ శ్రీ జైమల్ మేడతీయ ఇచ్చేవాడు. 8000 మంది రాజపుత్రుల వీరులతో కలిసి 60000 మంది మొఘలులతో యుద్ధం చేశారు. ఆ ఆయుధ్దంలో 48000 మంది చనిపోయారు.ఇందులో 8000 మంది రాజపుత్రులు 40000 మంది మొఘలులు
మహారణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.
హల్ది ఘాట్ యుద్ధంలో మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు .వాళ్ళు మహారణాను వారి పుత్రుడిగా భావించేవారు.మహారణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నంలో ఒకపక్క రాజపూత్ మరొక పక్క భీల్ ఉంటారు.
రాణా గుర్రం అయిన చేతక్ మహారణాను 26 అడుగుల కందకాన్ని దుమికి అది దాటిన తరువాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందరి ఒక కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది.అది ఎక్కడైయతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది.అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు.
చేతక్ ఎంత బలమైనదంటే ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అంతా ఎత్తులో గాలిలో ఎగిరేది అది కూడా మహారణాతో పాటుగా
మహారణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు.
శ్రీ మహారణా ప్రతాప్ యొక్క బరువు 110 కిలోలు మరియు అతని పొడవు 7’5’’. ఇరువైపుల దారు ఉన్నటువంటి కత్తి, 80 కిలోల ఈటె తన ఉంచుకునే వాడు.
మహారణా ప్రతాప్, అతని గుర్రం గురించి విన్నారు, అతనికి ఒక ఏనుగు కూడా ఉండేది.దాని పేరు రాంప్రసాద్....!

Special thanks to శ్రీ.అవ్వారు శ్రీనివాసరావు  గారు ! from  whatsap

1 వ్యాఖ్యలు:

SAI RAM May 10, 2017 at 5:38 AM  

Excellent information sr

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP