శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆయుర్వేదం –కొన్ని చిట్కాలు

>> Sunday, March 20, 2011

ఆయుర్వేదం –కొన్ని చిట్కాలు /చల్లా.జయదేవానంద శాస్త్రి .
------------------------------

--------------------------------------------


కీళ్ళ నొప్పికి తైలం:
------------------------------

ఆముదం చెట్టు వేర్లు 1 కిలో తీసుకోవాలి దాని పైన తోలును చాకు తో తీసి
పక్కన పెట్టు కొని ఆముదము అర(1/2 కిలొ) కిలో నీరు 4 రెట్లు
చేసె విధానం:

ఆముదం తోలు అర కిలొ (1/2కిలొ) ఒక పాత్రలో వేసి అందులో నాలుగు రెట్లు నీరు
అనగా 2 కిలోలు పొయ్యాలి. దానిని పొయ్యి మీద సన్నటి సెగ మీద పెట్టి, అర
కిలో నీరు మిగిలె వరకు మరిగించి, దానిని దించి, వడపోయాలి. దీనిని మళ్ళి
పొయ్యి మీద పెట్టి అర కిలో ఆముదము పోసి,సన్నట్టి సెగ మీద మరిగించి, నీరు
అంత ఆవిరి అయ్యి పోయక ఆముదము మాత్రమే మిగలాలి, తరవాత దానిని దించి,
వడపోసుకొని దానిలో మిరియాల పొడి 10 గ్రాములు, పిప్పళ్ళ పొడి 10 గ్రాములు,
ముద్ద కర్పూరం 30 గ్రాములు, కాచిన ఆముదములో వేసి బాగ కలిపి, చల్లార్చి
గాజు సీసలో నిల్వచేసుకోవాలి.
ఉపయోగించె విధానం:

దీనిని గోరు వెచ్చగ చేసుకొని ఎక్కువగ కీళ్ళ నొప్పులు వున్న చోట నెమ్మదిగ
మసాజ్ చేయాలి తరువాత పాత ఇటుక రాయి ని దంచి పొడి చేసి బాండి లో వేయించి,
దానిని ఒక గుడ్డలో చుట్టి, మసాజ్ చేసిన చోట కాపడం పెట్టాలి. ఆ తరవాత
చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యాలి



మొటిమలకు:-

రేగి పాండు గింజలు పగలగొట్టి అందులోని పప్పును తీసుకుని పొడి చేయాలి,
దానిలో తగినంత వెన్న , కొద్దిగ తేనె కలిపి మెత్తగ నూరాలి.ఈ పెస్ట్ ని
మోటిమల మీద, మోటిమల వల్ల కలిగిన మచ్చల మీద వ్రాయాలి,ఎండి పోయాక గోరు
వెచ్చటి నీటితో ముఖం కడుకోవాలి, ఇలా 40 రోజులు చేయలి.
రేగి పండు గింజల పొడి నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు

అరుగుదలకోసం:-

పచ్చి పుదీన, పచ్చి కరివేపాకు, పచ్చి కోత్తిమీర అన్ని సమానముగ (ఒక
100గ్రా)తీసుకోవాలి. అవి మిక్సిలో వేసి రసం తీయాలి, ఆ రసాన్ని కొలిచి,
అంతే పటికబెల్లం అందులో బాగ కరిగెటట్టు కలిపి దానిని పొయ్యి మీద పెట్టి
సన్న సెగ పెట్టాలి, అది తీగ పాకం వచ్చె వరకు వుంచి దానిని దించేసి,
చల్లార్చిన తరువాత ఒక గాజు సీసలో నిల్వ చేసుకొవాలి.

ఉపయోగించె విధానము:

ఈ పాకానిని కుండ నీటిలో వదతం చాల మంచిది ఒక గ్లాస్స్ నీటికి 2 స్పూన్స్
పాకనిని కలిపి త్రాగాలి పైన చెప్పిన పాకం లో ధనియాలు, జీలకర్ర పొడులు
కుడా జత చేసుకోవచ్చు
--------------------------------------------------------------------------------------------

అధిక రక్తపోటుకు సూచనలు-
High BPలేక అధిక రక్తపోటు కొరకు తీసుకొవల్సిన కొన్ని సూచనలు.
----------------------------------------------------------------------------------------

కరివేపాకు కారం పొడి 2 లేక 3 సార్లు ఉదయం టిఫిన్ లో తినవలెను . దీనిని
తీసుకోవడం వల్ల రక్తం లో వున్న వ్యర్ధ పదార్ధములను తొలగిస్తుంది.

కరివేపాకు కారం తయారు చేసె విదానన౦--:

యెండు మిర్చి 100గ్ర, చింతపండు 50గ్ర, కరివేపాకు చిన్నవి 4 కట్టలు,
ధనియాలు 10గ్ర, మినపప్పూ 1చెంచ, ఆవాలు 1/2 చెంచ,జీలకర్ర 1
చెంచ,వెల్లుల్లి 10 రెబ్బలు,ఉవ్పు తగినంత, కొంచం పసుపు, అన్ని దోరగా
వేయించి మిక్సి లో వేసి, తరవాత, చింత పండు , ఉవ్పు, పసుపు, వెల్లుల్లి
కూడ మిక్సి లొ వేసి తిప్పి, నిల్వ చేసుకొవాలి.

తీసుకోవలసిన పండ్ల్ రసాలు-

బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, దోసకాయ, టమాట.. కలిపి చేసుకొని ఊదయానే
తీసుకోవాలి లేక ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, యాపిల్, దానిమ్మ .. కలిపి
చేసుకొని ఊదయానే తీసుకోవాలి వెల్లుల్లి + పాలు కలిపి రాత్రి త్రాగి
పడుకోవాలి
-------------------------------------------------------------------------
చర్మ సౌందర్యము, రక్త శుద్ది కి క్యారెట్ హల్వా-
--------------------------------------------------------------

టమాటాలు 50 గ్రాములు
క్యారెట్ 50 గ్రాములు
బీట్ రూట్ 10 లేక 20 గ్రాములు
నిమ్మ కాయ 1
పటిక బెల్లం 50 గ్రాములు
తేనె 50 గ్రాములు
టమాటాలు చిన్న చిన్న ముక్కలు గా చేసి మిక్సిలో వేసి, కొంచం నీరు పోసి రసం
తీసి వడపోయలి, తరవాత ఆ రసం లో పటిక బెల్లం పొడి వేసి పొయ్యి మీద పెట్టి
సన్న సెగ పెట్టాలి, తీగ పాకం వచ్చె వరకు వుంచి దించేయాలి, దానిని బాగ
చల్లారాక, గాజు సీస లో నిల్వ చేయాలి,
ఉపయోగించె విధానం: రోజు గ్లాసు నీటిలో 2 లేక 3 స్పూనులు పాకం చల్లటి నీటి
లొ కలిపి , ఒక నిమ్మ చెక్కను కుడా కలిపి 2 లేక 3 సార్లు త్రాగాలి.
తేనె వేడి చేయరాదు, వేడి పదార్ధలలో వేయ రాదు.
౧. పైన రసం నుంది వచ్చిన పిప్పిని మిక్సిలో వేసి పాల మీద మీగడను వేసి
తిప్పాలి, దానిని మొఖానికి వ్రాసుకోవాలి 15 లేక 20 నిమిషాలు వుంచి
కడుక్కోవాలి
౨. టెబుల్ ల్యాంపు లో 15 లేక 20 వాట్సు బల్బు ని పెట్టి దానికి బ్లూ కలర్
కవెర్ చుట్టి, దాని కిరణాలు మొఖానికి పైన చెప్పిన పేస్టు పట్టించిన
దానిమీదా కొంచం దూరం గ పెట్టాలి, ఈ కిరణాల వల్ల త్వరగా ముఖం మీధ వున్న
మచ్చలు, మట్టి పోయి అందముగ వుంటుంది.

తలలో చుండ్రు సమస్య-
నిమ్మ కాయలు 2 లేక 3 పండినవి
కొబ్బరి నూనె మంచిది పావు కేజి
నిమ్మకాయలను బాగ క్రింద రుద్ది, కాయను కోసి, రసాన్ని పిండి వడ పొయాలి
బాండి లో కొబ్బరి నూనె, నిమ్మ రసం పోసి, పొయ్యిమీద పెట్టి, సన్నటి సెగ
పెట్టాలి, రసం నూనెలో కలిసి పోయి పొంగు తగ్గిపొతుంది, రసం అంత ఆవిరి
అయిపోయి , నూనె మాత్రమే మిగులుతుంది, దానిని వడ పోసి, బాగ చల్లారిన
తరువాత, గాజు సీసలో నిల్వచేయాలి
ఆ నూనెను వారానికి రెండు సార్లు, రాత్రి ముని వేళ్ళతో పాయలుగ తీసి,తలకు
పట్టించాలి
వుదయానె కుంకుడు కాయలతో కాని లేక సికకాయ్ పొడితో కాని తల స్నానం చేయాలి
జుట్టు వూడుతుంది అని మాన వద్దు
కొన్ని జాగ్రత్తలు:
దువెన: శుబ్రముగ కడిగి దువ్వుకోవాలి
దిండు కవరు: ప్రతి సారి మార్చలి స్నానం చేసాక
షాంపుతో తల స్నానం చేయరాదు
-------------------------------------------------------------


నడుము నొప్పి-
-------------------------------
కటి చక్రాసనం : చేతులు పైకి యెత్తి నిమ్మదిగా ప్రక్కనుండి వెనక్కు
తిరగాలి రెండు వైపుల చేయాలి 10 సార్లు
అర్ధ చంద్రాసనము: ఒక చేయి పైకి యెత్తి, ప్రక్కకు వంగాలి, రెండు వైపుల
చేయాలి 10 సార్లు రోజు
కొబ్బరి లడ్డు, నువ్వుల లడ్డు తినాలి

దాంపత్యము :
వేసవి కాలం: 3 లేక 4 రోజులకు
వాన కాలం : 7 లేక 15 రోజులకు
చలికాలం : రోజు
1.తెల్ల తవుడు పావు కేజి జల్లించాలి
పాత బెల్లం పావు కేజి
ఆవు లేక గేద నెయ్యి పావు కేజి
అన్ని బాగ కలిపి దంచాలి దానిని 10 లేక 15 గ్రాముల వుండలు చేసి బాగ గాలికి
ఆరబెట్టి గాజు పాత్రలొ నిల్వ చేసుకొవాలి
వుదయం, సాయం కాలం వాటిని తిని, పాలలో పటిక బెల్లం కలుపుకొని త్రాగాలి ఇలా
40 రోజులు చేయలి 22
2. మఱ్ఱిచెట్టు దెగ్గరికి వెళ్ళి సుర్యోదయానికి ముందె, చెట్టు కి గాటు
పెట్టి దానికి పాలు వస్తాయి, వాటితో ఒక గుడ్డను తడిపి, దానిని నడుము మీద
అతికించాలి, అది వుడిపోదు..
౩.నల్లతుమ్మ చెట్టు జిగురు లేక బంక, తీసుకొని, దానిని చిన్నముక్కలుగ
చేసి, నెయ్యి వేసి వేయించాలి, దానిని పొడి చేసుకొని, దానిలో పటిక బెల్లం
పొడి కలిపి నిల్వ చెయ్యాలి, రోజు ఒక స్పూను తిని పాలు త్రాగాలి.
-------------------------------------------------------------------------

నడుము నొప్పి-౨
నడుము నొప్పి నివారణకు లేక రాకుండ తీసుకో వలసిన జాగ్రత్తలు-
-----------------------------------------------------------------------------
వ్యాయామము:
1.తూర్పుగా నిలబడి చేతులు వెనక కటి మీద పెట్టి రెండు పక్కలకు తిరుగుతు 10
సార్లు చేయాలి చేతులు రెండు నడుము మీద పెట్టి, గుండ్రము(round) గా
తిప్పాలి 10 సార్లు
౨. నౌకాసనం వేయాలి
ఆహారము:
కారము, చేదు, వొగరు, అతి వీడి, అతి చల్లని పదార్ధలు తింటె నడుము నొప్పి
వస్తుంది ఆవకాయ, పండుమిర పకాయ పచ్చడి తినకూడదు
తినవలసినవి:
మామిడి పండ్లు, అరటి పండ్లు, తీపి పదార్ధలు ఇంట్లో చేసినవి...
వెల్లుల్లి గారెలు :
మినప పిండిలో వెల్లుల్లి గుజ్జు
అల్లం 3 గ్రాములు
ఇంగువ 3 చిటికెలు
సైంధవలవణం పావు స్పూను
అన్ని కలిపి గారెలు చేసుకోవాలి 2 లేక 3 తినాలి ప్రతి రోజు తినడం వల్ల
మొకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, వాతము తగ్గుతాయి
మినుములు, సున్ని యేదొ విధముగ రోజు తినాలి
బాదం పప్పు పావు కేజి,మునిగెటట్టు వేడి నీటిలో రాత్రి నాన పెట్టి, వుదయాన
వాటి పొట్టు తీసి, యెండ పెట్టి పొడి చేసుకొవాలి,
గసగసాలు పావు కేజి పొడి చేసి జల్లించాలి
పటిక బెల్లం పావు కేజి
అన్ని కలిపి ఒక గాజు పాత్రలో నిల్వచేసుకొవాలి రోజు వుదయం పరగడుపున, సగం
గ్లాసు నీటి లో 2 స్పూనులు వేసుకొని త్రాగాలి
పైన చెప్పినది త్రాగడం వల్ల కళ్ళు బాగుంటాయి
జ్ఞానము, జ్ఞాపకము, ధారణా శక్తి పెంపొందుతుంది


ముఖ సౌందర్యము-
ముఖ సౌందర్యము, శరీర సౌందర్యము
పచ్చిపసుపు దుబ్బలు (లావుగ,పొడవుగా ఉంటాయి)
వీటిని చిన్న ముక్కలు చేసి బాగ ఎండ బెట్టి పొడి చేసుకోవాలి
నల్ల నువ్వులు దోరగ వేయించి పొడి చేసుకోవాలి
ఈ రెందు పొడులను పచ్చి పాలతో కాని నీటితో కలిపి స్నానానికి గంట ముందు
వంటి నిండ పట్టించి స్నానం చేయాలి
ఈ విధంగా రోజు చేయడం వల్ల , మంచి నిగారింపు వస్తుంది
---------------------------------------------------------------


తక్కువ రక్తపోటు-
లో రక్తపోటు కి తీసుకోవల్సినవి :
-----------------------------------------------------
1. రోజు బస్రిక ప్రాణాయామం చేయలి
2. అల్లం రసం 1 స్పును
నిమ్మ రసం 1 స్పూను
తేనె 1 స్పును
అన్ని బాగ కలిపి ఒక గంట ఆహారానికి ముందు ఉదయం, సాయంకాలం తీసుకోవాలి,దీని
వల్ల అరుగుదల జరిగి, బాగ అకలి వేస్తుంది, దీనిని పెద్దలు, పిల్లలు
తినవచ్చు, పిల్లలకు వారి వయస్సు ప్రకారం ఇవ్వాలి.
3. ఎండు ద్రాక్ష సగం(1/2) గ్రాం లేక ఎండు కజ్జూర
అంజీర 2
అన్ని రాత్రి సగం గ్లాసు నీటి లో నాన బెట్టి, ఉదయానె ఆ నీటిని వడ పోసి
త్రాగాలి, నానిన పండ్లను తినాలి తరవాత ఒక గంట వరకు ఏమి తిన కూడదు
ఈ విధం గా 40 నుండి 100 రోజులు దాక తీసుకోవాలి
4. చిన్న టమాటాలు 2
క్యారెట్ 1
బీట్ రూట్ 3 ముక్కలు రోజు సాయంకాలం 4 లేక 5 గంటలకు తినాలి
పైనవి పాటించినచో లో రక్తపోటు నుండి విముక్తి పొందవచ్చు
--------------------------------------------------------

చేతులు, కాళ్ళ పగుళ్ళ నివారణ:-
---------------------------------------------------------
ప్రాణయామము:
చంద్ర భేధన బస్రిక ప్రాణాయమము:
1) కుడి ముక్కు మూసి, ఎడమ ముక్కు నుండి వేగం గా గాలి పీలుస్తూ ఉండాలి
2) ఎడమ ముక్కు నుండి నిమ్మది గా గాలి పీలుస్తూ, కుడి ముక్కు నుండి
నిమ్మది గ వదలాలి
సీతలీ :
నాలుకను రెండు ప్రక్కలు మడవాలి అది ఒక గొట్టం లాగ వస్తుంది, నిమ్మది గా
గాలి పీల్చాలి, చల్లటి గాలి లోపలికి వెలుతుంది.నాలుకని మాములు గా పెట్టి,
నిమ్మదిగా గాలి వదిలెయాలి.
సీత్ కారి:
పెదాలు తెరిచి పైన పళ్ళను, క్రింద పళ్ళ ను భిగింధి, గాలి నిమ్మది గా
పీల్చాలి, మళ్ళి నోరు మాములుగ పెట్టి గాలి నిమ్మది గ వదిలెయాలి.
అ) రాత్రి పడుకునె ముందు తప్పకుండ కాళ్ళకు, చేతులకు కొబ్బరి నూనె
వ్రాయాలి
ఆ) కుంకుడు కాయ రసంతో పగుళ్ళను బ్రషుతో రుద్దాలి
ఇ) జీలకర్ర 100 గ్రాములు పొడి చేయలి
దనియాలు 100 గ్రాములు దనియలు దోరగ వేఇంచి పొడి చేసుకొవలి
పటికబెల్లం 100 గ్రాములు అందులో కలిపి, గాజు సీస లో నిల్వచేసుకోవాలి.
దీనిని రోజు అర స్పూను మూడు పూటలా తినాలి,ఆహారనికి 30 నిమిషాలు ముందు,
దీని వళ్ళ వేడితగ్గుతుంది.
కాకర కాయ లేక కాకర ఆకు బాగ నూరి అందులో పసుపు కలిపి రాత్రి పడుకునె ముందు
వ్రాసుకొని పడుకొవాలి
జలుబు మరియూ ఆస్త్మ నివారణకు-
వ్యాయామము:
ఉజ్జయి ప్రాణాయామము: గొంతును బిగించి, గాలి పీల్చి,కుడి ముక్కు మూసి, ఎడమ
ముక్కుతో గాలీ వదలాలి
సూర్యభేధన ప్రాణాయామము:
ఎడమ ముక్కు మూసి కుడి ముక్కుతో గాలి పీల్చి,మళ్ళి కుడి ముక్కు మూసి ఎడమ
ముక్కుతో వదలాలి
ధీర్గ భస్రిక:
దీర్గం గా గాలి పీల్చి, నిమ్మదిగా వదలాలి
భుజంగాసనం:
బోర్ల పడుకొని చేతులు చాతి పక్కన పెట్టి,గాలి పీల్చుతూ చాతి వరకు పైకి
లేపాలి , వదులుతూ క్రిందకు రావలి

దుమ్ము, ధూళి, కఫము, తుమ్ముల నివారణ :
తులసి టీ:
తులసి ఆకులు 10
మిరియాలు 10
అల్లం 2 గ్రాములు
తులసి ఆకు, మిరియాలు దంచి, 2 కప్పుల నీటి లో వేయాలి, పొయ్యిమీద పెట్టి
మరిగించాలి 1 కప్పు అయ్యెవరకు, దించేసి వడపోసి అందులూ 1 స్పూను పటిక
బెల్లం పొడి వేసికొని ఉదయం, సాయంకాలం త్రాగాలి, త్రాగిన తరవాత, 1 గంట
వరకుయేమి తినకూడదు, స్నానము చేయరాదు
ఆస్త్మ:
పసుపు కొమ్ములు 100 గ్రాములు ముక్కలు చేసి పొడి చేయాలి
పాత గొదుమలు 100 గ్రాములు దోరగా వేయించి పొడి చేయాలి
రెండు కలిపి నిల్వచేయాలి
బాగా ఆస్త్మ వుంటే, పిల్లలకు చిటికెడు, పెద్దలు 2 లేక 3 చిటికెలు గోరు
వెచ్చని నీటిలో కలుపుకుని త్రాగాలిఆస్త్మ నివారణకు:-
ఆవ నూనెను గోరువెచ్చగ చేసి మొఖము నుండి ఛాతీ వరకు పట్టించి క్రింద
వ్యాయామాలు చేయాలి
1. నిలుచుని చేతులు ముందుకు చాపి ప్రక్కలకు తీసుకొని వెళ్ళాలి ఇలా 10
సార్లు
2. నిలుచుని చేతులు ముందుకు చాపి పైకి తీసుకొని వెళ్ళాలి ఇలా 10 సార్లు
3. నిలుచుని చేతులు ప్రక్కలకు చాపి, పైకి తీసుకొని నమస్కారాం పెట్టలి 5
సార్లు
4. చేతులను ప్రక్కలకు చాపి, గుండ్రము గా తిప్పాలి, ముందుకు, వెనకకు ఇలా
10 సార్లు చెయాలి
పిత్తము, వాతము, కఫము వల్ల ఊపిరి తిత్తులలొ సమస్యలకు నివారణకు:
కరక్కాయల పొడి 100 గ్రాములు
తానికాయల పొడి 100 గ్రాములు
ఉసిరికాయల పొడి 300 గ్రాములు
పిప్పళ్ళ పొడి 100 గ్రాములు
గమనిక: ఉసిరి ఫొడి =కరక్కాయల ఫొడి+తానికాయల ఫొడి+ పిప్పళ్ళ ఫొడి
అన్ని విడివిడి గా పొడులు చేసుకొని, జల్లించి పెట్టు కొని ముందుగ
కరక్కాయల పొడి ఒక ప్లేటు లోకి తీసుకొని, దానిలో తానికాయల పొడి కొంచం
కొంచం గా కలపాలి, తరవాత ఉసిరి పొడి,ఆ తరవాత పిపళ్ళ పొడి అదేవిధము గా
కలిపి ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి
రోజు పావు స్పూను పొడి లో ఒక స్పూను తేనె కలిపి ఆహారనికి 30 నిమిషముల
ముందు తినాలి దీనిని 40 రోజులు వదలకుండ వాడాలి.
బాగ ఆస్త్మ వుంటే రోజుకు 3 సార్లు తినాలి
దీని వల్ల వేడి చేస్తె పొడి ని కొంచం తక్కువగా తీసుకోవాలి
-------------------------------------------------------------------------------
రాలుతున్న జుట్టుకు, తెల్లని జుట్టు నివారణకు కలబంద నూనె-
-------------------------------------------------------------------------
కలబంద నూనె తయారు చేసే విధానం:
కలబంద గుజ్జు పావు కిలో
కొబ్బరి నూనె పావు కిలో
కలబంద మట్టను తీసుకుని, దానిని చీల్చి లోపల వున్న గుజ్జును
గీరాలి,ముద్దలు గా వేయవద్దు, గీరితె సాగుతూ వస్తుంది.
ఒక బాండి లొ కొబ్బరి నూనె ను పో సి, అందులో, ఈ కలబంద గుజ్జును వేసి బాగ
నూనెలో కలిసిపోయెటట్టు కలపాలి, బాండి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ
పెట్టి, కలుపుతూ వుండాలి అడుగు అంటకుండ, నీరు అంతా ఆవిరి ఆయిపోయి నూనె
మాత్రమే మిగులుతుంది.
దించెముందు మర్వం లేక ధవనం వేసి కలపాలి, వాసనకు మాత్రమే, వెయ్యక పోయిన
పరవాలేదు .
ఈ నూనెను రోజు గోరువెచ్చగా చేసి తలలో కుదుళ్ళకు వ్రాసి బాగ మర్దన చేయాలి
------------------------------------------------------------------------------

మతిమరుపు నివారణకు:
--------------------------------------------------------------------------------
౧. సుఖాసనం లేక పద్మాసనం లో కూర్చుని, ఒక దీపం వెలిగించి ఏకాగ్రతతో
దానిని చూడాలి, కళ్ళు నొప్పిగా వున్న ఏకాగ్రత కోల్పొకూడడు.
2 రోజు చదువుకునే ముందు, ఉదయం, సాయంత్రం 'అ కారం', 'మ కారం', 'ఓం కారం'
కళ్ళు మూసుకొని జపించాలి కనీసం 5 నిమిషాలు.
3 బ్రమరి ప్రాణాయమం 'మ కారం' అనాలి
౪. ఏకాగ్రత కోసం పిల్లలకు పద్మాసనం అలవాటు చేయాలి.
ఆహారము:
తెల్లవారు జామున లేచి స్నానం చేసి, పైన చెప్పిన వ్యాయమాలు 10 నిమిషాలు
చేసి, చదవడం మొదలు పెట్టాలి.
సాయంత్రం 7 గంటలకు అన్నం తినేసెయాలి
బాదం పాలు
బాదం పొడి
సోంపు గింజలలు దోరగ వేయించి పొడి చేయాలి
పటిక బెల్లం
అన్ని తగినంత తీసుకొని, ఒక గ్లాసు పాలల్లో కలిపి పడుకునే ముందు రోజు
తప్పకుండ త్రాగాలి .
*గది లో సరస్వతి దేవి ఫోటొ పెట్టు కొని బొటనవెళ్ళను బ్రొకటి మీద పెట్టి
నమస్కారం చేయాలి.
* సరస్వతి చూర్ణం
సరస్వతి ఆకు పొడి 100 గ్రాములు
అశ్వగంధ పొడి 100 గ్రాములు
అతిమధురం పొడి 100 గ్రాములు
పటిక బెల్లం పొడి 100 గ్రాములు
అన్ని కలిపి, జల్లించి నిల్వచేసుకోవాలి
పిల్లల వయస్సును బట్టి కొంచం పొడి పాల్లలో కాని , నీటి లో కాని కలిపి
ఇవ్వాలి, లేదా పొడిని కొంచం తిని నీరు త్రాగాలి
---------------------------------------------------------------------

జ్ఞాన శక్తి కోసం-
------------------------------------------------------------------------
చదువుకునే ముందు పద్మాసనంలో జ్ఞాన ముద్ర వేసుకొని కూర్చుని బ్రామరి
ప్రాణాయామం 'మా' కారం అంటు చేయాలి
తూర్పుకు యెదురు గా కూర్చుని నిటారుగా గాలి పీల్చి, నిదానంగా వదలాలి
అశ్వగంధి 100 గ్రాములు
తాది బెల్లం 100 గ్రాములు రెండు బాగ దంచి కలిపి ఉదయం, సాయంత్రం తినాలి
మోచేతిని వంచకుంద చెయ్యి చాపి, బొటన వేలుని నొక్కుతూ వదలాలి [ఒక 10 లేక
15 సార్లు]
----------------------------------------


ఆస్తమా సమస్య-
---------------------------------------------
అ) పిప్పళ్ళను దోరగ వెయించి మెత్తగ పొడి చేయాలి 50 గ్రాములు
సైంధవ లవణము మెత్తటి పొడి 50 గ్రాములు
పాత బెల్లం 150 గ్రాములు
రొట్లొ అన్ని వేసి బాగ దంచి, దానిని నిల్వచేసుకోవాలి
రోజు 10 గ్రాము మొతాదు తినాలి

ఆ) ఆవు పాలు 400 గ్రాములు
నువ్వుల నూనె 100 గ్రాములు
అతిమధురం 10 గ్రాములు
ఈ మూదు బాగ కలిపి, పొయ్యి మీద పెట్టి సన్న సెగ మీద మరిగించాలి, నువ్వుల
నూనె మాత్రమే మిగులుతుంది, దానిని చల్లార్చి, నిల్వచేయాలి, దానిని ఒక
చుక్కల సీస లో పోసుకొని, రోజు, ఉదయం, సాయంత్రం 2 చుక్క చొప్పున ముక్కులొ
వేసుకోవాలి.
-------------------------------------------

దోమల నివారణకు:
-----------------------------------------------
వేప ఆకు పొడి
ఆవాలు దోరగ వేయించి పొడి చేయాలి
కర్పూరం
కల్లుప్పు పొడి
మట్టి పాత్ర
పిడకలు (ఆవు లేక గేద)
పిడకలు మట్టి పాత్ర లొ వేసి, దాని మీద, కర్పూరం వెలిగించి దానిలో మంట
వచ్చాక కసేపు బయట పెట్టాలి, కసేపు వుంచి దానిని ఇంట్లో పెట్టి, అన్ని
తలుపులు వేసేసి, ఆ మంట మీద పైన చేసిన పొడులు నిమ్మది నిమ్మదిగ వేయాలి
అపుడు పొగ వస్తుంది, ఆ పొగను 15 లేక 20 నిమిషాల పాటు, ఇంట్లో అన్ని
గదులలో వేయాలి
పైన చెప్పిన వాటితో పాటు ఇప్పుడు చెప్పె వాటిని కూడ వాడవచ్చు ఉత్తరేణి
ఆకుల పొడి కానుగ లేక గానుగ పొడిసీతఫలం ఆకు పొడి పొగాకు పొడి .
ఈ పొగ వేయడం వల్ల, మనకు చాల ఉపయోగము, కఫము వున్న, ఊపిరిత్తిత్తులలో ఏమన్న
సమస్యలు ఉన్న నివారిస్తుంది.
---------------------------------------------



బట్టతల నివారణకు -
-----------------------------------------------
వేప నూనె, ఆవ నూనె తల నుండి పాదాల వరకు వ్రాసుకోవాలి తలకు రోజు నూనె
పెట్టాలి, లేదా వారనికి 2 సార్లు రాత్రి నూనె పెట్టి నిమ్మదిగ 15 లేక 20
నిమిషాముల పాటు మర్దన చేసి, ఉదయం కుంకుడు కాయలతో కాని, శికకాయ తో కాని తల
స్నానము చేయాలి .
బట్టతల మొదలు అవుతునపుడె త్రిఫలాలు (వుసిరి,కరక్కయ,తానికయలు) అన్ని 10,
10 ముక్కల చొప్పున తీసుకుని, రాత్రి నాన పెట్టి, ఉదయానే నీటిని వడ పోసి,
ఆ నీటిని తలకు వ్రాసుకోవాలి, రోజు చేయలి, బట్టతల రాదు, వచ్చిన చోట జుట్టు
వస్తుంది.
-----------------------------------------------


ఎసిడిటీ నివారణకు -
---------------------------------------------
కిస్మిస్ ౧౦౦ గ్రాములు
అల్లం౨౦ గ్రాములు
పెద్ద సొంపు గింజలు ౨౦ గ్రాములు
మిరియాలు ౨౦ గ్రాములు (దోరగా వేయించి దంచి )
సైంధవ లవణము ౧౦ గ్రాములు
అన్ని కలిపి రొట్లో వేసి బాగ నూరాలి
గ్యాస్, కఫం, జఠరాగ్ని నివారణకు, ఆహారము జీర్ణము, సుఖ విరోచణమునకు ఉపయోగ
పడుతుంది.
దీనిని అన్నం లోకాని, చపాతి లో కాని తినవచ్చు

నోట్: అతి గా తినారాదు తింటే విరోచనాలు అవుతాయి.
-----------------------------------------
కంటి చూపు సమస్యకు--
---------------------------------------------
కరక్కాయల పొడి 30 గ్రా
తానికాయల పొడి 60 గ్రా
ఉసిరికాయల పొడి 90 గ్రా
అథి మధురం పొడి 10 గ్రా
వెదురుప్పు (తెల్లగ వుంటుంది) 10 గ్రా
పిప్పళ్ళ పొడి దోరగావేయించి పొడి చేయాలి 20 గ్రా
పటిక బెల్లం పొడి 440 గ్రా
(పైన పొడులు అన్ని కలిపిన దానికి రెండు రెట్లు పటిక బెల్లం వేయాలి)
అన్ని పొడులు బాగ కలిపి, గాజు సీస లో నిల్వ చేసుకోవాలి
10 సంవత్సరాల లోపు -- 1/4 స్పూను పొడి, 1/4 స్పూను నేయ్యి, 1/2 తేనె అనగా
మూడు వేళ్ళతో వచ్చినంత పొడిని తీసుకోవాలి
పెద్దవాళ్ళకు 1/2 స్పూను, 1/2 స్పూను నేయ్యి, 1 తేనె వయస్సును బట్టి
మోతాదు ఇవ్వాలి
ఇలా వాడుతు వుంటె కొన్ని రోజులకు కళ్ళ అద్దాలను తీసేయవచ్చు.

--

5 వ్యాఖ్యలు:

Anonymous March 20, 2011 at 10:20 AM  

Thanks for posting some tips from ayurvedam for various illness.
Can you also please post for Diabetes?

సత్యం శివం సుందరం March 20, 2011 at 12:15 PM  

ఆయుర్వేదమును అందరికి(బ్లాగర్స్‌‌కి)చేరవేస్తున్నందుకు
మీకు ధన్యవాదాలు
ఇంకా మరెన్నో తెలియజేయాలని కోరుతూ

మీ సారథి

anrd July 7, 2012 at 3:14 AM  

చక్కటి విషయాలను అందించిన అందరికి కృతజ్ఞతలండి.

Unknown October 23, 2013 at 7:12 AM  

http://ayurbless.blogspot.in/p/ayur.html

మధురకవి గుండు మధుసూదన్ April 9, 2015 at 5:51 PM  

అయ్యానమస్కారం! దయతో అర్శమొలలకు పరిష్కారం తెలుపగలరు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP